సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.
◆ వందశాతం ఉత్తీర్ణత.● శ్రీనిధి విద్యార్థినికి 586 మార్కులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కన బరిచారు. పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల చెందిన విద్యార్థినికి శ్రీనిధి 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్, ఝరాసంగం తహసిల్దార్ తిరుమలరావు, కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు కేవీడీ పవన్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.