– పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి
– సిరిసిల్ల జిల్లా ఉంటుందా పోతుందా తెలపాలి
– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 2(నేటి ధాత్రి):
గత అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ బిజెపి ఒక్కటని ప్రచారం చేసి అధికారం లోకి వచ్చాం అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అధికారం లోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లను తొలగిస్తుందని ఒక అంశం తెర మీధకు తెస్తున్నారని ఆయన వాక్యాలను ఖండిస్తున్నామని బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానకార్యర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీసీ,ఎస్సి,ఎస్టి,మైనారిటీ రిజర్వేషన్ లతో పాటు ఓబీసీ లో వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. అధికారంలో ప్రజాప్రతినిధిగా ఏది పడితే అది మాట్లాడి చులకన కావద్దని సూచిస్తున్నామని అన్నారు. జిల్లాల తగ్గింపు చేస్తారని ప్రచారం జరుగుతోందని సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా ఉంటుందా ఉండదా అని క్లారిటీ ఇప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ధూమాల శ్రీకాంత్, వడ్నాల శేఖర్, పల్లికొండ నరసయ్య, దేవులపల్లి శ్రీనివాస్, పిల్లి రాజు, చోక్కి శ్రీనివాస్, వెలిచాల అభి, లింగంపల్లి రాము, వేముల ప్రవీణ్, బూర సందీప్, చక్కని మహేష్, వేముల నితిన్, గాజుల అనిల్, సామల సాయి, బిట్ల జాఫర్, బూట్ల సాగర్, నాగం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ
