వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగాలి.

# పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్.

నర్సంపేట,నేటిధాత్రి :

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మండలంలో సజావుగా జరగాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్ తెలిపారు.దేశ వ్యాప్తంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుదవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్,ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్
ఉమాకాంత్ ద్రుపతి, దుగ్గొండి మండలంలోని కీలకమైన నాచినపల్లి,రేకంపల్లి పోలింగ్ స్టేషన్ లైన లను సందర్శించారు.సంబందించిన ఎన్నికల అధికారులకు పలు సలహాలు సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో కృష్ణవేణి, ఏసిపి కిరణ్ కుమార్,ఎమ్మార్వో రవిచంద్రరెడ్డి, దుగ్గొండి సీఐ రాజ గోపాల్ గౌడ్,ఎస్సై పరమేష్,ఎంఆర్ఐ రాంబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *