నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని స్థానిక మాంటిస్సోరి పాఠశాల ప్రధానో పాధ్యాయులు కుంభం రాజ పాపిరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల నూతన క్యాలెండర్ ను ది న్యూ మాంటిసోరి పాఠశాల చైర్మన్ ఎర్ర జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎర్ర జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం, అర్హత గల ఉపాధ్యాయుల బృందంచే నూతన విద్య విధానాలను కొనసాగిస్తూ నర్సంపేట పట్టణంలో విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎర్ర ఊర్మిళ,కుంభం రజినిపాపిరెడ్డి,సామ్యూల్ మోరిస్, సారంగం,బోనగిరి సుధాకర్, గన్నోజుప్రవీణ్,జయలక్ష్మి,లావణ్య,మమత,కాపరబోయినమాధవి,చైతన్య,శ్రుతి,సుస్మిత, మౌనిక,హారిక,సరిత,మాదారపు శ్రీనివాస్,విజేందర్,తదితర ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.