
Nationwide
9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు
నర్సంపేట,నేటిధాత్రి:
ఈ నెల తొమ్మిదోతేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ
బిఆర్టియు, సిఐటియు , ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ న్యూ, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అధికారి,మున్సిపల్ కమిషనర్ లకు వేరువేరుగా సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం,బిఆర్టియు రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునీశ్వర్,సిఐటియు జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబరు కోడ్ లను తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పనిని ప్రాథమిక హక్కుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలి యూనియన్ డిజైనర్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, అన్నం రాజు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం సమ్మయ్య, అల్వాల రాజు, గజ్జల మహేందర్,హమాలి పెద్ద మనుషులు జనార్ధన్, మంద మల్లయ్య, గాండ్ల రాములు,ఎడ్ల నాగులు తదితరులు పాల్గొన్నారు.