భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలోధర్నా నిర్వహించిన వివో ఏ,లు ఆశా ,కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు క్యాంప్ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి వినతిపత్రాన్ని స్వీకరించినారు అనంతరం ఎమ్మెల్యే తెల్లం మాట్లాడుతూ వివో ఏలు అతి తక్కువ వేతనం కేవలం 5000 రూపాయలకే పనిచేయటం చాలా బాధాకరమని అలాగే ఆశా కార్యకర్తలు కూడా 24 గంటలు పని చేస్తున్నారని వారి సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉందని నేను గతంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసినప్పుడు వారి ఇబ్బందులు స్వయంగా పరిశీలించినానని వారి సమస్యలపై ఈనెల 24 నుండి జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా ఈ సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. అనంతరం ఆశ వివో ఏ లను ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి లు మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వివోఏలు ఆశాలు అనేక రోజులు సమ్మె చేసి ఆ సమ్మె సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఆనాడు అనేక శిబిరాలకి కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు అని కావున తక్షణమే వివో ఏ లను ఆషా కార్యకర్తలను రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, రావలసిన బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని ,పని భారం తగ్గించాలని , డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నందున వీటిని వెంటనే ఆనాడు వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం అమలు జరపాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 24 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో వీరి ఎజెండాలను పెట్టి చర్చించి పరిష్కరించాలని కోరారు. లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివో ఏ ల జిల్లా ట్రెజరర్ చంద్ర లీల భద్రాచలం అధ్యక్షురాలు వెంకటలక్ష్మి చర్ల అధ్యక్ష కార్యదర్శులు అనురాధ మీన ఆశ బాధ్యులు అలివేలు వెంకట నరసమ్మ సిఐటియు నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు