2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది.

`దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది.

`2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది.

`గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు.

`1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు.

`రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు.

`1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవితమంతా కృషి చేశారు.

`ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకమైన నాయకుడు.

`రాజకీయ దురంధరుడు.

`ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ బలమైన కోరిక.

`ప్రణబ్‌ ముఖర్జీ వల్ల రాజకీయ నష్టం జరుగుతుందని భయపడ్డారు.

`ఇప్పుడు కాంగ్రెస్‌ కోలుకోకుండా పోవడానికి కారకులయ్యారు.

`చరిత్రలో రాజకీయ తప్పటడుగులు సహజమే.

`చెప్పుడు మాటలు విని రాజకీయ పార్టీ తమ పార్టీ కోలుకోకుండా చేసుకోవడమే

మునగడం తేలడం కాంగ్రెస్‌కు కొత్తకాదు. తనను తానే ముంచుకోవడం కూడా కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు. కాని మునిగినా తేరుకోవడం ఇంత కాలం పట్టడం అన్నది ఇప్పుడే ప్రధమం. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం చెందింది 1889లో..అప్పటి నుంచి దేశంకోసం పోరాటం చేస్తూనే వుంది. అసలు దేశం కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో రాజకీయం నెరపడమే ఎంతో దైర్యంతో కూడుకున్న పని. అయినా దేశం కోసం తెగించి పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే. ముఖ్యంగా మహాత్మాగాందీ 1917లో దక్షిణాప్రికా నుంచి వచ్చి స్వాతంత్య్రం సంగ్రామంలో అడుగు పెట్టక ముందు ఒకచరిత్ర..తర్వాత ఒక చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్‌లో 1910కి ముందు మితవాదులు ఎక్కువగా వుండేవారు. దాదాబాయి నౌరోజీ లాంటి వారు ఎలాగైనా సాతంత్య్రం సముపార్జనకోసం అర్జించండి అన్న తరహాలో ఉద్యమాలు చేశారు. 1910 తర్వాత లాలాలజపతి రాయ్‌, బాల గంగాదర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ లాంటి వారు స్వాతంత్య్ర సంగ్రామాన్ని అతి వాద దశకు తెచ్చారు. దాంతో దేశంలో కొంత హింసాత్మక ఉద్యమ వాతారణం నెలకొన్నది. అదే సమయంలో ఇండియాకువచ్చిన గాందీజీ సత్యాగ్రహంతో ఉద్యమం మొదలైంది. అప్పట్లో గాంధీజీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టిన వారున్నారు. కాని చివరకు గాంధీ మార్గమే.. గెలిచింది. అయితే మన దేశంలో మొదటిసారిగా 1934 ఎన్నికలు జరిగాయి. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అప్పటికే నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం మొదలైంది. 1947 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే స్వాతంత్య్రం జెండా ఎగురవేశారు. ఇది నేటి తరానికి చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. భారతీయ జనతాపార్టీ రకరకాల ప్రచారాలు సాగిస్తోంది. నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశ విభజనకు కారణమైతే, వల్లభాయ్‌ పటేల్‌ దేశాన్ని ఏకం చేశారంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు మాత్రమే హోం మంత్రిత్వ బాద్యతలు నిర్వహించారన్న విషయాన్ని కాంగ్రెస్‌ చెప్పుకోవడం లేదు. నిజానికి ఆ ప్లేస్‌లో ఏ నాయకుడు వున్నా, అదే పనిచేసేవారు. కాని స్వాతంత్రోద్యమంలో నెహ్రూ కాకుండా మరో నాయకుడు వుండేవారేమో? అనడానికి ఆస్కారమే లేదు. అంతటి బలమైన పునాదులున్న కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాందీ వున్నంత వరకు ఆ పార్టీ తిరుగులేని శక్తిగా, ఎదురులేని రాజకీయం చేసింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ మరణించిందో అప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచులకు చేరుకున్నది. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. కాని ఆ గెలుపును, ఆ బలాన్ని నిలుపులేకపోయింది. అప్పటికి బిజేపి కూడా అంత బలంగా లేదు. బోఫోర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ను పట్టి పీడిరచింది. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమైంది. బిజేపి బలపడేందుకు మార్గం వేసినట్లైంది. తర్వాతనైనా పార్టీని కాపాడుకునే ప్రయత్నం బలంగా జరగలేదనే చెప్పాలి. పివి. నర్సింహారావును పూర్తిగా నమ్మలేదు. ఆయన నాయకత్వాన్ని బలపర్చలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఊపియే1 గెలిచింది. అప్పుడు సోనియాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారు. కాని మన దేశ సార్వభౌత్వం విషయంలో రాజ్యాంగ సూత్రాలు అడ్డు తగిలాయి. సోనియాగాందీ ప్రధాని కాలేకపోయారు. అప్పుడే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుండేది. రాజనీతి తెలిసిన నాయకుడికి ప్రధాని బాద్యతలు అప్పగిస్తే ఎంతో బాగుండేది. అప్పటికి బిజేపిలో బలమైన నాయకులు లేరు. ఆ పార్టీకి క్ష్రేత్ర స్దాయి నిర్మానం పూర్తిగా లేదు. మౌన మునిగా పేరున్న మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేస్తే, తన రాజకీయానికి ఇబ్బందులు వుండవన్న ఆలోచనతో సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ స్దానంలో ఎవరున్నా సోనియాగాందీకి ఎదరు చెప్పే అవకాశం వుండేది కాదు. కాని సోనియాగాందీ ఎవరినీ నమ్మలేదు. సరే 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని చేశారు. తర్వాత 2009లోనైనా మరో నాయకుడిని ప్రధాని చేసినా కాంగ్రెస్‌కు ఈ పరిస్ధితి వచ్చేది కాదు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసినా పెద్దగా పార్టీలో అభ్యంతరాలు వుండేవి కాదు. కాని చేయలేదు. 2004లో రాహుల్‌ గాంధీకి మంత్రి వర్గంలో చోటు కూడా కల్పించలేదు. అది సోనియాగాందీ చేసిన మొదటి తప్పు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రిని చేస్తే పాలన మీద ఆయనకు కొంత పట్టు వచ్చేది. 2009లో ఆయన ప్రధాని అయ్యేందుకు ఇబ్బంది వుండకపోయేది. సరే తర్వాత 2009లో కూడా మంత్రిని చేయలేదు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ను రాజీనామా చేయించి, రాహుల్‌ను ప్రధానిని చేసినా బాగుండేది. అ పని చేయలేదు. 2009 ఎన్నికల తర్వాత మన్మోహన్‌ సింగ్‌ను కాకుండా ఎంతో రాజకీయ అనుభవం వున్న చాణక్యుడు ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానిని చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్దితి అసలే వుండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ లాంటి మరో చాణక్యుడు లేడు. కాని ఆయనను ప్రధానిని చేస్తే ఎక్కడ తన చేతుల్లో పవర్‌ వుండకుండాపోతుందో అన్న భయంతో సోనియా గాందీ నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఇప్పుడు ఇంత కాలం పార్టీ అధికారానికి దూరమయి వుండేది కాదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచన ఆనాడు చేయలేదు. ఇప్పుడు పదవి కోసం ఎంత ప్రయత్నం చేసినా కాలం కలిసిరావడం లేదు. ప్రణబ్‌ ముఖర్జీ ఇందిరాగాంధీకి ఎంతో నమ్మకమైన నాయకుడు. ఆమె హాయాంలోనే ఆయన ఆర్ధిక శాఖ నిర్వహించారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయనను మించిన వారు లేదు. పివి.నర్సింహారావు హాయాంలో కూడా ఆయన నెరిపిన విదేశీ వ్యవహరాల మూలంగా దేశానికి, ఆర్ధికాభివృద్దికి ఎంతో మేలు జరిగింది. అయితే ఇందిరాగాందీ మరణం తర్వాత రాజీవ్‌ గాందీని ప్రదాని చేయడం కొంత మందికి నచ్చలేదు. ఎలాంటి పాలనానుభవం లేని రాజీవ్‌ గాందీ వల్ల కాంగ్రెస్‌ నష్టపోతుందని అనుకున్నారు. అందులో ప్రణబ్‌ ముఖర్జీవున్నారనేది అప్పుడు ప్రచారం జరిగింది. దాంతో రాజీవ్‌గాంధీ ఆయనను పక్కన పెట్టారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. ఇక పార్టీలో వుండి లాభం లేదనుకున్న ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కొంత కాలానికి రాజీవ్‌ గాంధీకి అసలు నిజం తెలిసింది. ప్రణబ్‌ ముఖర్జీ అంటే గిట్టని వాళ్లు చేసిన ప్రచారం మూలంగానే అపోహపడినట్లు గ్రహించి, మళ్లీ ప్రణబ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అండగా వుంటూ వచ్చారు. పివి. నర్సింహారావును ప్రధాని చేయడంలో కూడా కీలకభూమిక పోషించారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బతికి వుందంటే ప్రణబ్‌ ముఖర్జీ లాంటి నాయకులే కారమని చెప్పకతప్పదు. 2004 ప్రధాని అయ్యే అవకాశం వున్నా సోనియాగాంధీ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. ఆనాడు రాజీవ్‌ గాంధికి లేనిపోనివి చెప్పినట్లే, తర్వాత సోనియా గాందీకి కూడా అదే నూరిపోశారు. దాంతో ఆమె ప్రణబ్‌ను ప్రదాని చేయడానికి ముందుకు రాలేదు. కాని తాను ప్రధాని కావలన్నా కోరికను ప్రణబ్‌కు ఎంతో వుండేది. గాంధీ కుటుంబాన్ని కాదని ఆయన ప్రదాని పదవి కోరలేదు. ఆ కుటుంబంలో రాహుల్‌ ప్రధాని కానప్పుడు తనకు అవకాశం వస్తుందని ఆశించారు. అయినా సోనియాగాంధీ కనికరించలేదు. కాకపోతే 2012లో ఆయనను రాజకీయాలను నుంచి దూరం చేసి, రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. నిజానికి ఆ పదవి ప్రణబ్‌కు ఇష్టం లేదు. ఆనాడు ప్రణబ్‌కు రాష్టపతి చేయకుంటే కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. రాష్ట్రపతిని చేసి పార్టీ కోసం పనిచేసేనాయకుడు లేకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో పార్టీని చెడగొట్టుకున్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించడం, స్పెక్ట్రమ్‌ లాంటి కేసులపై ముందూ వెనుకు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కాంగ్రెస్‌ కొంప ముంచింది. చివరికి ఏం తేలింది? స్పెక్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రింకోర్టు కేసు కొట్టి వేసింది. అప్పటికే కాంగ్రెస్‌కు జరగాల్సినంతనష్టం జరిగిపోయింది. ఇలా మన్మోహన్‌ సింగ్‌ హయాంలో వేసిన తప్పటడుగులు, కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!