
"Ramakrishnapur Celebrates Ganesh Idol Installations"
కొలువుదీరిన బొజ్జ గణపతులు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథుడు రామకృష్ణాపూర్ పట్టణంలో వివిధ మండపాలలో కొలువ తీరాడు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్, తిమ్మాపూర్ , కుర్మపల్లి,క్యాతనపల్లి, శేషు పల్లి, అమరవాది, రామకృష్ణాపూర్ ఏరియాలలో భాజా భజంత్రీలు, మంగళహారతుల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. కొలువుదీరిన గణనాథులకు వేద పండితులు, నవగ్రహ పూజలతో ప్రజలు , పుర ప్రముఖులు పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలో ప్రముఖ వినాయక మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించారు.వినాయక విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి, చిన్నా పెద్దా అంతా భక్తితో పూజలు నిర్వహించారు.