Dubai Group Donates Vaikuntha Ratham to Malyala Village
మల్యాల గ్రామపంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేసిన మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ – దుబాయ్ గ్రూపు సభ్యులు.
చందుర్తి, నేటిధాత్రి:
విదేశాల్లో ఉండి కూడా గ్రామాభివృద్ధికి సహాయం చేయవచ్చని చందుర్తి మండలం మల్యాల గ్రామ వాస్తవ్యులు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వాట్సప్ గ్రూపు సభ్యులుగా ఏర్పడి దాదాపు 3 లక్షల రూపాయలు చందాలుగా పోగుచేసి వైకుంఠ రథాన్ని తయారు చేయించారు .ఇట్టి రథాన్ని గ్రామ పంచాయతీ వారికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు 15 లక్షల రూపాయలను చందాలుగా తయారుచేసి గ్రామంలో వివిధ కార్యక్రమాలకు పంపించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ ఎఎస్పీ రిత్విక్ సాయి మాట్లాడుతూ…. పొట్టకూటి కోసం విదేశానికి వెళ్లి కొన్ని సందర్భాల్లో బిజి లైఫ్ లో ఉండి గ్రామాన్ని పట్టించుకునే పరిస్థితి లేకున్నా వారి కష్టార్జితం నుండి గ్రామాభివృద్ధికి సహాయం చేయాలన్న స్ఫూర్తితో వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి చందాలతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామానికి అందించిన గ్రామాభివృద్ధి కమిటీ- దుబాయ్ గ్రూపు సభ్యులను అభినందిస్తూ పుట్టినప్పుడు చాలా వేడుకలు ఏ విధంగా అయితే చేసుకుంటామో చనిపోయిన వారిని కూడా సకల మర్యాదలు చేయాలని సుప్రీంకోర్టు హక్కు కల్పించారని అన్నారు . గ్రామానికి అందించిన వైకుంఠ రథాన్ని గ్రామపంచాయతీ వారు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జిల్లెల్ల రమేష్, గ్రామ సర్పంచ్ మందాల శారద, ఉపసర్పంచి అనపర్తి నరేష్ కుమార్ , హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర , గ్రామ వార్డు సభ్యులు పత్తిపాక లావణ్య, అర్షం అనూష ,ఈసరి శిల్ప, లింగాల శ్రీనివాస్,పాటి సుధాకర్, తూమ్ గణేష్, గుంటపల్లి నారాయణ, పిట్ల మనోహర్, లక్కే సుదర్శన్,దుబాయ్ గ్రూప్ సభ్యులు పులి భాస్కర్, కొట్టే ప్రసాద్, అర్సం లోహిత్, ద్యావనపెళ్లి లక్ష్మీనారాయణ, కోన నరేష్, కొడగంటి గంగాధర్, కొడగంటి దేవయ్య, ఎంజాల నరేష్, లింగంపల్లి మదు సూధన్, తోగరి గంగాధర్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, గ్రామస్తులు యువకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు. అలాగే మల్యాల గ్రామానికి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎం పద్మ, ఎస్తార, కవిత, మంజుల, భాగ్య లను దుబాయ్ గ్రూపు వారు శాలువాతో సత్కరించి సన్మానించారు. వారితో పాటుగా గ్రామంలోని పలువురు పెద్దలను శాలువాలు కప్పి సన్మానించారు.
