Christians Should Share Love Like Jesus: Dr Praveen
ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతారు
క్రైస్తవులందరూ అదేవిధంగా ప్రేమను పంచాలి – డాక్టర్ ప్రవీణ్
తిరుపతి( నేటిధాత్రి)
ఏసుప్రభు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అప్పుడే నిజమైన క్రైస్తవులని ముఖ్య ప్రసంగీకులుగా పాల్గొన్న డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అని తెలిపారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా వేపాడ మండలం, నల్లబెల్లి సీయోను ప్రార్ధన మందిరం నందు నిస్సి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ గొర్లె టైటాస్ అధ్యక్షతన క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకలుగా డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ విచ్చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఏ మనిషికైనా ఈ లోకజ్ఞానం వ్యర్ధమని దేవుని జ్ఞానమే నిజమైన జ్ఞానమని అటువంటి వారికే దైవ గ్రంథం లోని మర్మాలు అర్థమవుతాయని ఆ విధంగా నడుచుకున్న వారికే అత్యున్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన చేతులతో, ఆయన పనికి వాడబడుతారని అన్నారు. ఏసుప్రభు వారు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమని పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అన్నారు. ముఖ్య అతిధి టీవీఎస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ మధు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి వారి పిల్లల్ని ప్రేమగా పెంచాలని ప్రేమగానే వారికి విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఆనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందించారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ లాజరస్, పాస్టర్ దావీదు, పాస్టర్ డేనియల్ పాల్, పాస్టర్ దేవకుమార్ ,కరుణాకర్ రచన దంపతులు, గ్రేస్ టైటస్, పాస్టర్, సంఘ పెద్దలు, యూత్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
