Comrade Pullareddy’s 41st Memorial Call in Siricilla
కరపత్ర ఆవిష్కరణ నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి
41 వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపు
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 41వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగినది.కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో పుట్టి మద్రాసులో ఉన్నత విద్యను అభ్యసించి 1952 భూస్వామ్య పెత్తందారి వర్గాల దౌర్జన్యాలను ఎదిరించి నందికొట్కూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు 1948 – 50 ల మధ్య 1968 – 84 మధ్య ప్రభుత్వ నిర్బంధాల కారణంగా రహస్య జీవితం గడిపి ప్రజల మధ్య కార్యక్రమాలు కొనసాగించాడు 1946 లోను 50 లోను 62 లోను ప్రభుత్వ రాజకీయ నిర్బంధాల కారణంగా సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపాడు 1953 నుండి కమ్యూనిస్టు పార్టీలో పాదుకుంటున్న తప్పుడు వైఖరి పాలకవర్గాల పట్ల రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడినాడు కమ్యూనిస్టు పార్టీకి పునర్మించే ప్రయత్నాలలో కృషిలో ముందు నిలిచాడు గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించి గోదావరి లోయ ప్రాంతంలో అనేకమంది ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినాడు ముఖ్యంగా మన సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించినాడు అట్టి విప్లవ మేధావికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామీకా వాదులు విప్లవ కమ్యూనిస్టు పార్టీల శ్రేణులు అన్ని వర్గాల కార్మికులు కర్షకులు హాజరుకావాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి దశరథం,AIFTU (న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వొల్లల కిషోర్,AIFTU (న్యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు,బామండ్ల రవీందర్,రాష్ట్ర కోశాధికారి తెలంగాణ రైతు కూలీ సంఘం మచ్చ అనసూర్య,పెద్దొల్ల సంగీత, గుజ్జే దేవదాస్, తడక రాములు,బొద్దుల శ్రీహరి,అకేని సత్తయ్య,బొల్లా వత్తిని ఎల్లయ్య వేముల రాజేశం,తదితరులు పాల్గొన్నారు.
