మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కి గురువారం మాజీ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాదర్శి సరిళ్ల రతన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివంగత నేత జగపతి రావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని కోరారు. వెలిచాల జగపతిరావు 1972-1977 వరకు జగిత్యాల నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా, 1978-1984 వరకు శాసనమండలి సభ్యులుగా, 1989-1994 వరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభ్యుడిగా పనిచేశారని తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఆయన్ను ప్రజాబంధుగా గౌరవించారని, పేదల కోసం నిరంతరం హరితపించిన మహా నేత జగపతిరావు అని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారని, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదేని యోగ్యమైన ప్రదేశంలో కరీంనగర్ ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన మహా నాయకులు జగపతిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈవినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గండి రాజేశ్వర్, మాజీ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సరిళ్ల రతన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండి శ్యామ్, పులి నర్సింగం, కాసారపు కిరణ్, గండి గణేష్, పెద్ది రవి తదిరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!