జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన వికలాంగుల సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భారత జాగృతి వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాగృతి వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ వికలాంగుల చట్టం 2016 ప్రకారం అర్హులైన వికలాంగులకు దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి, తదితర పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్ లాగ్ పోస్టులను వికలాంగులతో భర్తీ చేయాలని, వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలనీ, జిల్లాలోని సింగరేణి, జెన్కో, 100 పడకల ఆస్పత్రి , ఆర్టీసీ వంటి ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ, వికలాంగుల మానసి కోల్లాసం కొరకు వికలాంగులకు స్పోర్ట్స్ కిడ్స్ అందజేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశామని, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సానుకూలంగా స్పందించి, వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి వికలాంగుల సంఘం నాయకులు జిట్టబోయిన ప్రశాంత్,సాదా రఘు, ముదురుకోళ్ల నర్సయ్య,జె. సతీష్ పి. రాజేశ్వరరావు,యం. ప్రభాకర్,పి. చంద్రప్రకాష్ తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!