పేదలపాలిట పెన్నిది పెద్ది.

https://epaper.netidhatri.com/

తెలంగాణ ఉద్యమం ఎంత అంకిత భావంతో చేశామో, ఆకలి దప్పులు వదులుకొని, నిరంతరం రాష్ట్రం సిద్దించేదాకా ఎలా కొట్లాడానో, ఎమ్మెల్యేగా ప్రజలకు అంతే త్రికరణ శుద్దిగా సేవలందిస్తున్నాను. అంటున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎన్నికల ప్రచార సరళిపై ప్రజల స్పందన, చేసిన అభివృద్ధి ఆయన మాటల్లోనే..

`నర్సంపేట ను తీర్చిదిద్దిన నాయకుడు.

`తెలంగాణ ఉద్యమం కీలక పాత్రదారుడు.

`వరంగల్‌ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా వున్నాడు.

`మహా గర్జన వంటి సభ నిర్వహణతో పెద్ది పేరు మారు మ్రోగిపోయింది.

`ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్యమ సభలన్నీ పెద్ది రూపకల్పనలో జరిగినవే.

`బీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టతకు పెద్ది నాయకత్వం నిదర్శనం.

`కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచాడు.

`ఐసోలేషన్‌ సెంటర్‌ తన ఇంటి ముందే ఏర్పాటు చేసి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

`నర్సంపేట ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ బెడ్లు, వార్డులు ఎర్పాటు చేయించాడు.

`ప్రజలకు ఆ సమయంలో పెద్దన్నగా తోడున్నాడు.

`పేదలకు కరోనా కాలంలో ఆకలి బాధలు లేకుండా చూసుకున్నాడు.

`నర్సంపేటను అభివృద్ధికి చిరునామా చేశాడు.

`నియోజకవర్గం సస్యశ్యామలం చేశాడు.

`అన్ని రంగాలలో నర్సంపేటను తీర్చిదిద్దాడు.

`పార్టీలకతీతంగా సేవలందించాడు.

`సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చేశాడు.

`ఆపదలో వున్న వాళ్ల వైద్యానికి ఎల్‌ ఓసిలు తెలంగాణ లో అందరికన్నా ఎక్కువ ఇచ్చాడు.

`ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

`గ్రామాలకు గ్రామాలే పెద్దికి మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారు.

`నర్సంపేట లో పెద్దికి ఎదురులేదు.

హైదరాబద్‌,నేటిధాత్రి:

పేదల పాలిట పెన్నిది పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పడిన వేదనలు చూశాడు. వాటి నుంచి విముక్తి కోసమే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలిసి నడిచాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ విముక్తికోసమే ఆలోచించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తన నియోజకవర్గ ప్రజల అభివృద్ది కోసం, సంక్షేమంకోసం పాటుపడుతున్నాడు. పదేళ్లలో తెలంగాణను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలా అన్ని రంగాల్లో పురోగతిని చూపించారో, నర్సంపేటలో పెద్ది కూడా అంతటి ప్రగతిని చేసి చూపించారు.ఐదేళ్ల తన ఎమ్మెల్యే పదవీ కాలంలో దాదాపు సగం కాలం కరోనాతో పోయినా, ఆ సమయంలో ప్రజలే ప్రాణంగా చూసుకున్న నాయకుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి. కరోనా సమయంలో ఆ మాట వింటేనే ఎంతో మంది గజగజ వణికిపోయారు. ప్రజలను నేరుగా కలిసేందుకు ఎంతో భయపడ్డారు. కాని సుదర్శన్‌రెడ్డి మాత్రం తన ఇంటి ముందే ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, నియోజకవర్గంలో కరోనా బారిన పడిన వారికి దగ్గరుండి వైద్య సేవలందించారు. ఐసోలేషన్‌ సెంటర్‌లో వారిని నిత్యం కలిసి, వారికి మనో ధైర్యాన్ని నింపాడు. తిరిగి వారిని ఆరోగ్యవంతులుగా తయారుచేశారు. అందుకోసం ఆయన తీసుకున్న శ్రద్ద ఇప్పటికీ నియోజవర్గ ప్రజలు మర్చిపోవడం లేదు. తమ ప్రాణాలను కాపాడిన దేవుడు పెద్ది అంటూ కొలుస్తున్నారు. అంతే కాకుండా అత్యవసర వైద్య సేవలు అందాల్సిన వారికి నర్సంపేట ఆసుపత్రిలోనే సౌకర్యాలు కల్పించి, వారికి చికిత్సందించారు. అలా కూడా కరోనా బారిన పడిన వారికి ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందించి వారి ఆరోగ్యాలు కాపాడారు. వారి కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇక ఈ ఐదేళ్ల కాలంలో తెలంగాణలో వున్న అందరు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వైద్య సేవల కోసం ఎల్‌ఓసిలు ఇప్పించిన ఎమ్మెల్యేగా పెద్ది అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా కాలంలో తన నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ఆయనను పండ్లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, డ్రై ప్రూట్స్‌, సి విటమిన్‌ అందించే పండ్లు పంపిణీ చేసి ప్రజలకు ఆదుకున్న నాయకుడు పెద్ది. అలా ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన నాయకుడు ఆయన. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తన నియోజక వర్గంలోనే ప్రజలందరికీ సమానంగా సంక్షేమపథకాలు అందించిన నాయకుడు పెద్ది. అందుకే ఆయనను అన్ని రాజకీయ పార్టీల నాయకులు అభిమానిస్తున్నారు. ఈసారి పార్టీలకు అతీతంగా పెద్దిని గెలిపించుకుంటామంటూ నర్సంపేట ప్రజలు చెబుతున్నారు. నర్సంపేటలోని అనేక గ్రామాలు పెద్దికే తమ ఓటు అంటూ తీర్మాణాలు కూడా చేస్తున్నాయి. దీనంతటికీ పెద్ది చేసిన సేవలే నిదర్శనం. తన నియోజకవర్గంలో అత్యధికంగా సిఎం. రిలీఫ్‌ఫండ్స్‌ కూడా ఇప్పించిన నాయకుడిగా పేరు పొందారు. ఇలా అన్ని వర్గాల ప్రజల గుండెల్లో పెద్ది గూడు కట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో గొప్పగా వుంది. ప్రచారం కోసం ప్రజలే స్వచ్ఛందంగా పెద్దికి వారి కష్టం చేతిలోపెడుతున్నారంటే పెద్ది మీద వారికి వున్న అభిమానం ఎంతటిదో అర్దం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పెద్ది సుదర్శన్‌రెడ్డి. వరంగల్‌ లో జరిగిన మహా గర్జన అంటే చరిత్రలో నిలిచిపోయిన సభ. అలాంటి సభలో ప్రపంచంలోనే గతంలో లేవు. ఆ తర్వాత కూడా రాలేదు. అంతగొప్పగా తెలంగాణ ఉద్యమ సమయంలో సభ నిర్వహించి శభాష్‌ అనిపించున్న నాయుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఎమ్మెల్యేగా ఐదేళ్లే అయినా ఆయన చేసిన అభివృద్ది అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో ఆయన చూపిన మానవత్వం మాటల్లో చెప్పలేనిది. అలాంటి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీ వున్నారు. ఆ సందర్భంగా నర్సంపేటలో జరిగిన అభివృద్దిపై పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న అభివృద్ధిపనులు ఆయన మాటల్లోనే…
నర్సంపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాడు.
నియోజకవర్గం సస్యశ్యామలం చేయడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్దిలో నెంబర్‌ వన్‌చేశాను. వరంగల్‌ జిల్లాలో చరిత్రలోనే హర్టీకల్చర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను నల్లబెల్లి మండలం కన్నారావు పేటలో ఏర్పాటు చేయించడం జరిగింది. గత ఏడాది కురిసిన అకాల వర్షాలకు నష్టపోయి రైతులకు రూ.52 కోట్లు నష్టపరిహారం అందించడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో వున్న 68,391 మంది రైతులకు రైతు బంధు అందుతోంది. రైతు భీమా కింద 389 మంది రైతు కుటుంబాలకు భీమా సొమ్మును అందజేయం జరిగింది. నియోజవర్గంలో 29 రైతు వేదికలు పూర్తి . రూ.11 కోట్లతో సుమారు 7500 మంది రైతులకు సబ్సిడీతో విద్యుత్‌ మోటార్లు అందజేత. రూ.80 కోట్లతో లక్ష మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణం. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో రైతు ఆహార ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పిఓ) ఏర్పాటు. వాటి ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేత. మిర్చీ పరిశోధన కేంద్రానికి అసవరమైన స్ధల సేకరణ పూర్తి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఒక్క నర్సంపేట నియోజవర్గంలోనే దాదాపు 1000 ట్రాక్టర్లు అందించాం. 60 మంది ఎస్సీ ఎస్టీ రైతులకు 90శాతం సబ్సిడీతో ట్రాకర్లు అందజేత. 1990 మంది పాల రైతులు, కార్మికులు, మత్స కారులకు, గొర్రెల కాపరులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. ఇక నీటి పారుదలపై అత్యంత శ్రద్ద పెట్టడం జరగింది. జివో.నెంబర్‌. 20 ద్వారా వట్టివాగుపై చెక్‌ డ్యామ్‌ కం రోడ్‌ బ్రిడ్జి నిర్మాణం. చెన్నారావు పేట వాగుపై చెక్‌ డ్యాం. 336 కోట్లతో రామప్ప`పాకాల ప్రాజెక్టు పూర్తి. రెండు పంటలకు పూర్తి స్ధాయిలో సాగుకు నీరందుతోంది. రూ.225 కోట్లతో రామప్ప` రంగరాయ చెరువు పనులు పూర్తి. రెండేళ్లుగా గోదావరి జలాలతో ఆ ప్రాంతం సస్యశ్యామలం. నర్సంపేటకు ఇరిగేషన్‌ కార్యాలయం మంజూరు. ఎస్సారెస్సీ..డిబిఎం ద్వారా సుమారు 65 వేల ఎకరాలకు సాగు నీరు. నియోజకవర్గం మొత్తం చెరువులు , చెక్‌ డ్యామ్‌లు, ఎస్సారెస్సీ , ఇతర ప్రాజెక్టులన్నీ కలుపుకొని 1,26,099 ఎకరాలకు నీరందించాం. నిండు కుండలా మాదన్నపేట చెరువు గోదావరి జలాలతో గత రెండేళ్లగా కళకళలాడుతోంది.
సంక్షేమంలో నర్సంపేట నెంబర్‌ వన్‌గా నిలిచింది.
నియోజకవర్గంలో 48,581 మందికి ఆసరా ఫెన్షన్లు అందుతున్నాయి. ఇప్పటి వరకు 11,300 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందజేయడం జరిగింది. 1630 మంది దళిత రైతులకు ఎస్సీ, కార్పోరేషన్‌ ద్వారా 70 శాతం సబ్సిడీతో 4520 పాడి గేదెలు అందజేయడం జరిగింది. అంతే కాకుండా 145 మంది దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ పధకం కింద 435 ఎకరాలు అందించడం జరిగింది. నియోజకవర్గం లో 1150 మందికి దళిత బంధు యూనిట్లు అందించాం. 1200 బిసి యూనిట్లు, 3500 గృహలక్ష్మి యూనిట్లు, 120 మైనార్టీ యూనిట్లు అందజేత. వంద మందికి దళిత బంధు యూనిట్లు అందించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పోరేషన్ల ద్వారా రుణాలు. దాదాపు 10వేల మంది నిరుపేదలకు ఎల్‌ఓసి, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందిచడం జరిగింది. ఇది తెలంగాణలోనే ఒక రికార్డు. నియోజకవర్గంలో వున్న 338 చెరువులలో చేప పిల్లల పెంపకం. ముదిరాజ్‌ సోదరులకు ట్రాలీలు, మోపెడ్లు అందజేత. గొల్ల కురుమలకు 11,781 గొర్రెల యూనిట్లు అందజేత. గిరిజన సంక్షేమంలో కూడా నర్సంపేట ముందజ. పోడు సాగు చేసుకుంటున్న 3271 మంది గిరిజనులకు 7337 ఎకరాల భూమి పట్టాలు అందించడం జరిగింది. 3271 మంది గిరిజనులకు రైతు బంధు సాయం అందజేత. తాజాగా పోడు పట్టాలు అందుకున్న 1805 మంది రైతులు రైతు బంధు. నియోజకవర్గంలో వున్న 5074 మంది గిరిజనుల 11606 ఎకరాలకు రైతు బంధు అందించడం జరుగుతోంది. గిరిజనుల కోసం నర్సంపేట లో ఏసి తో కూడిన బంజారా భవన్‌ నిర్మాణం జరుగుతోంది. అన్ని తండాలకు రూ.100 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం. కొత్తగా ఏర్పాటు చేసిన 40 గ్రామ పంచాయితీలకు అంతర్గత రోడ్లు. 40 పంచాయితీ భవనాలు. గిరిజన తండాలలో పల్లె దవఖానాలు. నర్సంపేట నియోజకవర్గంలో 1100 మంది గిరిజన రైతులకు సబ్సిడీతో విద్యుత్‌ మోటార్లు అందజేత. గిరి వికాస్‌ పేరుతో బోర్‌ వెల్‌ సాగు ఏర్పాటు.
వైద్య ఆరోగ్య శాఖలో కూడా నర్సంపేటకు కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ తేవడం జరిగింది.
సమారు 450 పడకల ఆసుపత్రి, నిర్మానం తుది దశలో వుంది. మరో మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఆ మెడికల్‌ కాలేజీకి 1650 పోస్టులు మంజూరు చేయించడం జరిగింది. రూ. 30 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు. కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌తో సేవలు. నర్సంపేట నియోజకవర్గంలో 49 ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఉచితంగా అందించే 57 రకాల వైద్య పరీక్షల కోసం భవన నిర్మాణం పూర్తి. త్వరలో సేవలు అందుబాటులోకి…కరోనా సమయంలోనే ఆర్‌టిపిసిఆర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటిలో బస్తీ దవఖాన ఏర్పాటు. 2020లో కరోనా బాధితులు, తలసేమియా వ్యాధి గ్రస్తులకోసం నియోకజవర్గంలోనే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 8350 యూనిట్ల రక్తాన్ని దాతలు అందించారు. వాటిని ప్రభుత్వానికి అందించడం జరిగింది. దాంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో 76500 కుటుంబాలకు సి.విటమిన్‌ లభించే పండ్లు ప్రజలు అందించడం జరిగింది. దేశంలోనే మొదటిసారి ఒక ఎమ్మెల్యే ఫ్రీ ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, 1179 మందిని కాపాడడం జరిగింది.
విద్య విషయంలో నర్సంపేటను ముందుంచడం జరిగింది.
గిరిజన సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయించాం. ఇది తెలంగాణలోనే మొదటిది కావడం విశేషం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఇది పెద్ద విద్యా సంస్ధ. దుగ్గొండిలో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు. నర్సంపేటలో ఎస్సీ బాలుర గురుకులం ఏర్పాటు. గిర్నిబావి దగ్గర బిసి గురుకులం పాఠశాల ఏర్పాటు. విజినే పల్లి ఖానాపూర్‌లో బిసి బాలికల పాఠశాల ఏర్పాటు. సర్వాపురంలో బిసి బాలికల గురుకులం ఏర్పాటు. ఎస్టీ బాలురల కోసం నర్సంపేటలో పాఠశాల. మైనార్టీ బాలికల గురుకులం ఏర్పాటు. అర్భన్‌ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల మహేశ్వరంలో ఏర్పాటు. ఎన్‌ఏసి ద్వారా మహిళ ఉపాదికోసం కుట్టుమిషన్‌ శిక్షణాకేంద్రం. ఉచితంగా కుట్టు మిషన్లపంపిణీ. ఎస్సీ యువత కోసం స్కిల్‌ డెవలప్‌ మెంటు సెంటర్‌ త్వరలో ప్రారంభం కానున్నది.
నర్సంపేట మోడల్‌ అభివృద్ది అందరికీ ఆదర్శం.
రాష్ట్రంలోనే పైపుడ్‌ నేచురల్‌ గ్యాస్‌ మొదట అవకాశం నర్సంపేటకు తేవడం జరిగింది. నాచురల్‌ గ్యాస్‌ ద్వారాఇంటింటికీ గ్యాస్‌ సప్లై జరగుతోంది. మార్కెట్‌లో సిలిండర్‌ ధర 1250 రూపాయలు వుంది. అదే గ్యాస్‌ను పైప్‌ ద్వారా ప్రజలకు రూ.730కే అందించడం జరుగుతోంది. మున్సిపాలిటీలో 12 కిలోమీటర్ల పరిదిలో సెంట్రల్‌ లైటింగ్‌పూర్తి. మున్సిపాలిటీలో 9 కిలోమీటర్ల పరిధిలో బిటీ రోడ్ల నిర్మాణం, సైడ్‌కాల్వల నిర్మాణ జరుగుతోంది. ఆర్‌ అండ్‌ బి ద్వారా 30 కిలోమీటర్ల రోడ్డును రూ.45 కోట్లతో నిర్మాణం. పిఎంజిఎస్‌వై ద్వారా 25 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణం. నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో 200 కిలోమీటర్ల మేర అంతర్గత సిసి రోడ్లు. రూ.60 కోట్లతో మండలాల్లో బిటి రోడ్ల మరమ్మత్తులు. నర్సంపేట`నెక్కొండ ప్రదాన రహదారిపై శిధిలావస్ధలో వున్న ముగ్ధుంపూర్‌ బ్రిడ్జి నిర్మాణం. గిరిజన గ్రామాలలో ఎస్టీసబ్‌ ప్లాన్‌ ద్వారా 54 కిలోమీటర్ల రోడ్డు నిర్మానం. 22 కోట్లతో నూతన బిటి రోడ్లు నిర్మాణం. నెక్కొండ, నల్లబెల్లి మండల కేంద్రాలలో కొత్త డబుల్‌ రోడ్ల నిర్మాణం. 2022లో కురిసిన వడగండ్ల వానకు ద్వంసమైన రోడ్ల మరమ్మత్తులు. పంచాయితీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి ద్వారా రోడ్ల నిర్మాణం. నియోజకవర్గంలో 133 కేవి 14 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పనులు పూర్తి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి. నూత గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు. 69 నూతన జిపిల భవనాలు. ప్రతి గ్రామానికి వివో. మహిళా భవన నిర్మాణం. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 2023`24లో 8500 మంది మహిళలతో క్రీడోత్సవాలు నిర్వహించడం అన్నది గొప్ప సందర్భం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *