
మున్నూరు కాపులు పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి
……సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్
మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పో నగంటి మల్లయ్య ,పట్టణ అధ్యక్షులు ఏ బూషి శ్రీనివాస్ లకు ఘన సన్మానం
జమ్మికుంట (నేటిధాత్రి)
మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్ అన్నారు. మంగళవారం మున్నూరు కాపు సంక్షేమ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు ఏ బూసి శ్రీనివాస్ ల ను మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామ మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.రానున్న కాలంలో మున్నూరు కాపులు అందరు ఐక్యం కావాల్సిన అవసరమెంతైన ఉన్నదని రాజకీయంగా,ఆర్థికంగా,అందరం ఎదుగాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పొనగంటి మల్లయ్య, ఏ బూసి శ్రీనివాస్ లు మాట్లాడారు. మున్నూరు కాపుల ఐక్యత కొరకు పాటు పడతామన్నారు . మున్నూరు కాపుల ను ఏకతాటి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు . మున్నూరు కాపులను చైతన్యపరిచి ,రాబోయే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా కుల బాంధవులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. కుల ప్రాతిపదికను సంఖ్యాపరంగా మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని వారన్నారు. తప్పకుండా మున్నూరుకాపు సోదరులు పేరు చివరన పటేల్ అని పెట్టుకోవాలన్నారు. సన్మానం చేసిన ఉద్యోగ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో సన్మిత్ర సంక్షేమ సంఘము సభ్యులు మర్రి అవినాష్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, పొనగంటి సంపత్, ఏ బూసి శ్రీనివాస్ (విద్యోదయ), వేల్పుల రాజేందర్, ఏబూసి సతీష్, ఉడుగుల సంపత్, బోనగిరి సారయ్య తదితరులు పాల్గొన్నారు.