
Indian badminton
జపాన్ ఓపెన్ మన కథ ముగిసెన్
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్లో పరాజయంతో ఇంటిబాట పట్టారు…
సాత్విక్ జంట, లక్ష్యసేన్ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్లో పరాజయంతో ఇంటిబాట పట్టారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ఫైనల్లో లక్ష్యసేన్ 19-21, 11-21తో కొడాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ఇక సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ 22-24, 14-21తో చైనా జంట లియాంగ్ వీ కెంగ్/వాంగ్ చాంగ్ చేతిలో ఓటమి చవి చూసింది. అనుపమా ఉపాధ్యాయ 21-13, 11-21, 12-21తో వాంగ్ ఝీ హీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.