గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి.
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.
చిట్యాల ,నేటి ధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో *12*జూనియర్ కళాశాలలను రద్దు చేసి విద్యార్ధులకు అన్యాయం చేసే
ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్ చేశారు.
అనంతరం మల్లయూమాట్లాడుతూ నిరుపేదలు, ఫఆర్థికంగా లేని విద్యార్థులు కళాశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం వలన తమ చదువులు కొనసాగించ లేక పోతారని తెలిపారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని అన్నారు.
ఈ ప్రభుత్వం మూసివేసే గురుకుల జూనియర్ కళాశాలలో 8 బాలికల వి, 4 బాలురవి అని తెలిపారు.
ప్రభుత్వం రద్దు చేసే గురుకుల జూనియర్ కళాశాలలు* జోగులాంబ, గద్వాల జిల్లా ఇటిక్యాల (బాలురు), కరీంనగర్ జిల్లా చొప్పదండి ( బాలికలు), భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ( బాలికలు) ఖమ్మం జిల్లా సత్తుపల్లి ( బాలురు) కూసుమంచి (బాలికలు), మహబుబబాద్ జిల్లా నర్సింహులపేట ( బాలికలు), సిద్దిపేట జిల్లా దుబ్బాక ( బాలురు), సంగారెడ్డి జిల్లా రాయి కోడ్ ( బాలికలు), కామారెడ్డి జిల్లా బిచ్కుంద ( బాలురు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (బాలికలు), జనగామ జిల్లా చిట్యాల నర్మెట్ట ( బాలికలు), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి (బాలికలు) ఈ కళాశాలను మూసివేసే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఇట్టి సమాచారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నే యుగేందర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.