నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి
డీఎస్పీ నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అది హర్షించదగిన విషయమే కానీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసినటువంటి ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంచిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను విడుదల చేయాలని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఇత్తదని ఎదురు చూస్తే వాళ్లు ఇవ్వలేదు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కావస్తున్నా మీరు ఇవ్వలేదు పేదవారికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది మీకు పంచడం ఇష్టం లేకపోతే అది మాకు అప్పగించండి వారం రోజుల్లో పూర్తిగా పారదర్శకంగా పంచి చూపెడతాం అని కలెక్టర్ ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ ఇంజపెల్లి విక్రమ్ పాల్గొన్నారు