మహనీయుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలి

బీజేపీ మండల అధ్యక్షులు రాకేష్
చందుర్తి, నేటిధాత్రి:

భారత దేశ స్వాతంత్ర్యం కొరకు మరియు దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన భారతదేశ వీరుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బిజెపి మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ అన్నారు.మంగళవారం రోజున మండల కేంద్రానికి చెందిన బత్తుల ఉదయ్ మరియు ముడపల్లి గ్రామానికి చెందిన పుల్కాం మనోజ్ కు భగత్ సింగ్ జీవిత చరిత్ర అందజేశారు.చందుర్తి మండలంలో స్వాతంత్ర సమరయోధుల జీవితచరిత్ర లు సుమారు 300 పుస్తకాలు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ,మహారానా ప్రతాప్, సుభాష్ చంద్రబోస్, అంబేత్కర్, అల్లూరి సీతారామరాజు, జాన్సీ లక్ష్మి భాయ్ తదితరులు చరిత్రలు నేటి తరానికి తెలియజేప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!