ఘనంగా 2వ రోజు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గల నూతన ఎల్లమ్మ ఆలయం నందు శ్రీ ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన. కార్యక్రమంలో రెండవ రోజు ఎల్లమ్మ విగ్రహానికి, గణపతి విగ్రహానికి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఊరేగించి జలాభిషేకం చేయడం జరిగింది. మరియు ప్రాతశాపాసన, వాస్తు పూజన, వాస్తు శాంతి, పర్యగ్నికరణ, లక్షణోద్ధారణ, జలాధివాసన, బింబశుద్ది, ధాన్యాధివాసన, కళానాహన, శాంతి హవన, పంచావరణ స్థాపన, తత్త్యత్రయ మూలమంత్ర హవన, నీరాజన, మన్త పుష్ప సమర్పణ, నిత్యబలిహరణ, తీర్ధప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ దేవాలయ నిర్మాణ దాత శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కోమల్లపెల్లి సంపత్ కుమార్ రూత్విక బృందం ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.