సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి
మంచిర్యాల జూన్ 30 నేటి దాత్రి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మంచిర్యాల జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం రోజున తపస్ సంఘ కార్యాలయం, మంచిర్యాల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ పాల్గొన్నారు.
కంచే చేను వేసిన చందంగా సిపిఎస్ కు గత 13 నెలలుగా ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం శోచనీయమని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తనిఖీలకు ఉపాధ్యాయులు వెళ్తే పాఠాలు ఎవరు బోధిస్తారని, సంబంధిత ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ప్రతి 20 మందికి ఒక టీచర్ ను ఇవ్వాలని, 100 మంది విద్యార్థులు ఉంటే 5 ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని, బదిలీలు చేపట్టి, వందలాదిగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని, పాఠశాలల్లో ఉన్న వివిధ ఖాళీలను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని, ఎన్ ఈ పి ని తెలంగాణలో వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్ల బిల్లులను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన మేరకు వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ప్రతినెల 1వ తారీఖున చెల్లించాలని, కేజీబీవీ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, రవికుమార్ లు డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సమావేశంలో జిల్లా నాయకులు నీలేశ్ కచ్వాల్, భారతీ అశోక్, గోపాలరావు, మండల నాయకులు శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు