
BC Leaders Slam Govt for Betrayal on Reservations
రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి నాయకులు కేసు వేసి అడ్డుకోవడం పట్ల స్పందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది అని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు . 5 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం EWS రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకులు అడ్డుకోలేదని అగ్ర వర్గాలలో ఉన్న పేదలకు న్యాయం చేయాలని కోరుకున్న బీసీ సమాజానికి నేడు రెడ్డి జాగృతి నాయకులు బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు పట్టు పట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో బీసీలు అగ్ర వర్గాలతో రాజకీయ యుధం చేయడానికి సిద్ధమే అని హెచ్చరించారు.ఈ సమావేశంలో లో జహీరాబాద్ తాలూకా బీసీ నాయకులు కొండాపురం నర్సిములు, డా.పెద్దగొల్ల నారాయణ,పెద్దతోట రాచన్న ,కోహిర్ మండల్ నాయకులు,విశ్వనాథ్ యాదవ్,రమేష్ ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీకాంత్,అంబదాస్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.