— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
• కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే
నిజాంపేట: నేటి ధాత్రి
రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు లేడనీ నేడు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం తో పాటు ముందుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్” స్కూల్ ప్రారంభించుకోవడం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గల్లి గల్లికి సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ హేనని కొనియాడారు. అందరి సహకారంతో మండల కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ఇన్చార్జి ఎమ్మార్వో రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, నజురుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, అమర సెనరెడ్డి, సిద్దారములు, గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ , వెంకట్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.