అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాశిబుగ్గ నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని రూ 99.80 లక్షలతో చేపట్టిన ఏకశిల జంక్షన్ అభివృద్ధి పనులకు,98 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి పనులకు మరియు 80 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ నుండి రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వరకు నిర్మించనున్న వరద కాలువ నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యల మీద డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించామని,ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు.డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాను అని తెలిపారు.ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. త్వరలో డివిజన్ లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గీసుగోండ,సంగెం,ఆత్మకూరు, దామెరలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో 3 బ్యాచ్ లు పూర్తి చేసుకున్నారన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని,దానికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.డివిజన్ లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మంచినీరు, శానిటేషన్,లైటింగ్ కూడా ప్రాధాన్యతమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.