సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
◆- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి*
◆ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటికల నెరవేరాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.మొగడంపల్లీ మండలంలోని మాడ్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి, పునాదులు తీసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సోసైటి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,మొగడంపల్లీ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ హర్షద్ పటేల్,ఎంపిడివో మరియు వివిధ శాఖల అధికారులు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.