ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి.!

Mandal Education Officer K. Hanumantha Rao Mandal Education Officer K. Hanumantha Rao

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం

 

మండల విద్యాశాఖ అధికారి కే.హనుమంతరావు

నడికూడ,నేటిధాత్రి:

 

ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా! గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి హనుమకొండ ఆదేశానుసారం తేదీ 01/05/ 2025 నుండి 15 /05/ 2025 వరకు,జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించబడును, ఈ క్యాంపులో విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ యొక్క,డాన్స్, యోగ,డ్రాయింగ్,మొదలైన అంశాల పైన శిక్షణ ఇవ్వబడును,కావున నడికూడ మండల పరిధిలో గల 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ సమ్మర్ క్యాంపునకు హాజరై సద్వినియోగం చేసుకోగలరు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరూ సమ్మర్ క్యాంపుకు హాజరయ్యే విధంగా చూడగలరు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయుటకు మరియు విద్యార్థుల సంఖ్యను పెంచుటకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం.కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అందరూ సహకరించవలెనని కోరుచున్నాని మండల విద్యాశాఖ అధికారి కే హనుమంతరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!