సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉన్నటువంటి హక్కులను ఈ నాలుగు లేబర్ కోడ్ వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆదాని అంబానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్, కందికొండ రాజు, నాయకులు ఇప్ప సతీష్, జగన్నాధం కార్తీక్, మోలుగురి రాజు, మున్సిపాలిటీ కార్మికులు యశోద, హన్మకొండ మరియా, ఉమా ఎలీషా తదితరులు పాల్గొన్నారు.