ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ ,నేటిధాత్రి :
రాష్ట్రంలో అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది చరిత్రలో నిలిచిపోతుందని వర్గం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ ఏర్పడ్డాక అమలు చేస్తుందని తెలిపారు.
గృహ జ్యోతి పథకం అమలుతీరును పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ డివిజన్ లోని కుమ్మరి బస్తీలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్నారని కొనియాడారు.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడమే ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి,పాశికంటి నాగరాజు,డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్,ఎస్-సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ,సల్ల ప్రభాకర్ రెడ్డి,మంచాల రఘు,డివిజన్ జనరల్ సెక్రటరీ తుమ్మల దేవి రెడ్డి,సుంకు శేఖర్ రెడ్డి,పాలడుగు లక్ష్మణ్, హనుమంతు, మంద మురళి కృష్ణ రెడ్డి,వర్కింగ్ ప్రసిడెంట్ భాస్కర్ రెడ్డి,మాశెట్టి రఘువేద్ర గుప్తా,ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి,జిత్తు రెడ్డి,రంగుల శేఖర్,నరేష్, బంటి,శివ తదితరులు పాల్గొన్నారు.