కమిషన్ ల మీదున్న శ్రద్ధ, కర్షకుల పై లేదు.
◆:- 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.
◆:- రైతు ప్రభుత్వం అంటూనే రైతుల పొట్ట కొడుతోంది.
◆:- బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్న, శ్రద్ద పట్టింపు రైతుల పైనా గ్రామ పంచాయతీ ల పైనా మంత్రివర్గంనకు లేకపాయె అని ఝరాసంగం మండల బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ మరియు ప్రభుత్వం రైతు సంక్షేమం కాంక్షిస్తామన్నా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. రైతులకు సరిగా రుణమాఫీ చెయ్యలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఇస్తామన్న బోనస్ ను సైతం ఇప్పటికి రైతులకు అందించలేదు. అన్నం పెట్టిన రైతులే అధికారాన్ని కులగొట్టే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు కరెంట్ ఇచ్చి పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసిన నాయకుడు కేసీఆర్ ఆనవాళు ఏ చేరిపివెయ్యడం ఎవరి తరం కాదు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామి ఒక్కటీ నెరవేర్చలేదు. 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజల కడుపు నింపే రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకైనా రైతు భరోసా వేసి అండగా నిలవాలని కోరుతున్నాము.
