మొదటి వార్షికోత్సవ సభ

Congress party Congress party

మొదటి వార్షికోత్సవ సభ

మందమర్రి నేటి ధాత్రి :

 

మందమర్రి మార్కెట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి మొదటి వార్షికోత్సవ పాలన విజయోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం బి1 లో కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్,సేవాదళ్ నాయకుల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ కాకా మనవడు,వివేక్ వెంకట్ స్వామి గారి తనయుడు అయినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు పాలన సంవత్సరం గడిచిన సందర్భంగా మందమర్రిలో కేకులు కట్ చేయడం జరిగింది. గెలిచాక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద కొడుకు లాగా ఉంటానని మాట ఇచ్చి నిలుపుకున్నాడు.లక్ష 35 వేల మెజార్టీతో అతి చిన్న వయసులో విజయం దక్కించుకున్న నాయకుడు గడ్డం వంశి గారు అని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పదివేల పెన్షన్ ఇవ్వాలని పోరాడి 144 కోట్ల పెన్షన్ ఫండ్ మంజూరు అయ్యేలా చేసిన ఘనత మరియు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని,ఎల్లంపల్లి ముప్పు గ్రామం బాధితులకు పరిహారం ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో కరోనా కాలంలో నిలిపివేసిన అజిని ఎక్స్ప్రెస్ పున ప్రారంభం,పెద్దపల్లిలో తిరుపతి ఎక్స్ప్రెస్ ను హాల్టింగు రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి పెద్దపల్లి నియోజకవర్గం లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు మరియు ఎన్టిపిసి పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి,అలాగే బడుగు బలహీన వర్గాలకు త్రాగునీరు అందించేలా బోర్వెల్ లాంటి వివిధ అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామని ముత్తయ్య, వనం నర్సన్న,ఎర్ర రాజు,ఇషాక్, బండి శంకర్,లక్ష్మణ్,వెంకన్న, రాచర్ల గణేష్,సట్ల సంతోష్,విజయ్,సతీష్,వేణు,శ్రీనివాస్,అంజయ్య,రామకృష్ణ,
యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్,జావిద్ ఖాన్,మూడారపు శేఖర్, సురేందర్(సేవాదళ్), చోటు,మహేష్,సూరజ్,రాజు అజయ్,బాచి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!