నిజాంపేట, నేటి ధాత్రి
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం రోజున ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఇమామ్ జనాబ్ అన్వర్ సాబ్ మాట్లాడుతూ దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటామని ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారన్నారు.ముఖ్యంగా భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమని అన్నారు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ఖుర్బానీ ఇవ్వడం, ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని బంధువులకు, స్నేహితులకు, రెండవ భాగాన్ని పేదల కోసం ఇవ్వడం, మూడవ భాగం కుటుంబం కోసం ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు యండి అఙ్గర్, మైనొద్దిన్, బాబు మియ, అబ్దుల్ అజీజ్, అబ్దుల్, పాషా, అబ్దుల్ రబ్, గౌస్ పాషా, తల్హా, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.