-రేవంత్ పాలనకు మేఘ సందేశం!
-కాంగ్రెస్ పాలన అంటేనే వానా కాలం కలిసి రావడం.
-ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం వున్నంత కాలం కరువే.
-తర్వాత పదేళ్లు కాంగ్రెస్ పాలనంతా జలమే జలం.
-తెలంగాణ వచ్చిన తర్వాత జూన్ లో విస్తారమైన వానలెప్పుడూ లేవు.
-అవసరానికి రాని వానలు తిరోగమన రుతుపవనాలు కురిసేవి.
-నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసేవి.
-మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కరువు తెలంగాణలో మాయమైంది.
-గతంలో ఎప్పుడూ లేని విధంగా మేలోనే వాన పలకరింపు.
-తొలకరి సమయానికి పూర్తి వానలు.
-ఖరీఫ్ సాగుబాటుకు ముందే వాన ముహూర్తం.
-వాన కోసం ఎదురుచూడకుండానే వరణుడి కనికరం.
-గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి కనబడలేదు.
-ఈసారి పెద్దగా చెడగొట్టు వానలు లేవు.
-పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడలేదు.
-ఈసారి రైతుకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.
-కాంగ్రెస్ అంటేనే రైతుకు కలిసొచ్చేకాలం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవడం అనేది పాలకుడి జాతకం మీద ఆదారపడి వుంటుందని లెక్కలేయడం పరిపాటి. అందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో కూడా ఈ విషయాలు వెల్లడిస్తుంటారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమృద్దికరమైన వర్షాలు పడుతున్నాయి. గత ఏడాది మెండైన వానలే కురిశాయి. అందుకే గత పదేళ్ల కన్నా ఎక్కువగా రాష్ట్రంలో పంటలు పండినట్లు కూడా లెక్కలున్నాయి. పాలకుడి జాతకాలు కూడా వాతావరణ పరిస్దితుల మీద ప్రభావం చూపుతాయని అనేక సందర్భాలు కూడా రుజువు చేశాయి. గత యాభై ఏళ్ల కాలంలో మే నెల నుంచే వానలు కురవడం అన్నది ఎప్పుడూ లేదు. సహజంగా జూన్ మొదటి , రెండవ వారంలో మాత్రమే తొలకరి పలరింపులు జరుగుతుంటాయి. పైగా నైరుతి రుతుపవణాలు బలంగా వుంటే తప్ప ఆ తొలకరి కూడా పలకరించే అవకాశం వుండేది కాదు. కాని ఇంకా రుతుపవణాలు అండమాన్ నికోబార్ల్లను తాకమందు నుంచే వానలు కువడం అనేది చాలా అరుదు. మండు వేసవిలో ఇలా చల్లటి వాతావరణం కూడా చాలా అరుదు. సహజంగా మార్చి, ఎప్రిల్ నెలల్లో వడగండ్ల వానలు కురుస్తుంటాయి. ఇప్పుడు కొంత తక్కువైనా, గత ముప్పై, నలభైఏళ్ల కాలంలో ఎప్రిల్ నెలల్లో వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన సందార్భలు అనేకం వున్నాయి. వరి పంట పొట్టకొచ్చే సమయంలోనో, లేక పంట కోతల ముందో విపరీతమైన రాళ్ల వానలు పడుతుండేవి. దాంతో వరి కంకులు రాలిపోయేవి. పొలమంతా నీళ్లలో నానిపోయేది. రాళ్ల వానకు మొత్తం వరిగింజలన్నీ రాలిపోయేవి. ఇక ఇతర పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ వుండేవి. మామిడి వంటి తోటలకు తీవ్రమైన నష్టం జరుగుతుండేది. మార్చి, ఎప్రిల్ నెలల్లో పిందె దశలో వుండే మామిడికాయలు రాలిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతుండేవారు. ఒక వేళ మామిడి చేతికొచ్చే దశలోనైనా కూడా ఖచ్చితంగా చెడగొట్టు వానలైన వడగండ్లు కురుస్తూ వుండేది. గాలి దుమారం పెద్దఎత్తున మామిడి తోటను నష్టపరుస్తూ వుండేది. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయి, ఏడాదికొక పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలు రైతును కోలుకోకుండా చేసేవి. అదేంటో గాని ఈ నలభై సంవత్సరాల కాలంలో మొదటి సారిగా గత ఏడాది కూడా పెద్దగా చెడగొట్టు వానలు లేవు. అక్కడక్కడ తప్ప, పెద్దగా వడగండ్ల వానలు కురిసింది లేదు. రైతులు నష్టపోయింది లేదు. మామిడి రైతులు ఇబ్బందులు పడిన సందర్భం లేదు. ఈ ఏడాది కూడ అలాంటి వడగండ్ల వానలు పెద్దగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్నగా కురిశాయే గాని, రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు. సరిగ్గా ఈ ఏడాది ఉగాదికి ఒక రోజు ముందు గాలి దుమారం పెట్టింది. ఆ రాలిన కాయలు పండుగకు రైతులు తెచ్చి అమ్ముకున్నారు. లాభం పొందారు. ఇది అతిశయోక్తి కాదు. నూరు పైసల నిజం. ఉగాదికి ముందు రోజు గాలి దుమారం వల్ల రాలిపోయిన పండ్లుకూడా రైతులు అమ్ముకునే పరిస్థితి కూడా కలిసి రావడం అన్నది కూడా వింతైన అనుభవమనే చెప్పాలి. ఇక అప్పటినుంచి పెద్దగా చెడగొట్టు వానలులేవు. వడగండ్ల వానలు అసలే లేవు. గాలి దుమారం పెట్టినట్లు వార్తలు లేవు. రైతులు ఇబ్బందిపడే పరస్ధితి ఎదరుకాలేదు. కాకపోతే పంట చేతికొచ్చిన గత పదిహేను రోజుల మందు ఒకటి రెండు చెడగొట్టు వానలు కురిశాయి. కాని అవి తెలంగాణ అంతటా కురవలేదు. కొన్ని జిల్లాలకే పరిమితం కావడం వల్ల మిగతా ప్రాంతాల రైతులు ఎంతో సాఫీగా వరి కోతలు పూర్తి చేసుకున్నారు. వడ్లను ఐకేపి సెంటర్లకు తరలించుకున్నారు. అమ్ముకున్నారు. అయితే పంట ఒక నెల లేటుగా వేసుకున్న రైతులకు పంట చేతికి రావడానికి కొంత ఆలస్యమైంది. అలాంటి రైతుల వడ్లు ఇప్పుడు కళ్లాలలోనే వున్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెంట వెంటనే కొనుగోలు చేస్తూనే వుంది. సహజంగా కొన్ని సందర్బాలలో రైతులు ఇబ్బందులు పడడం అన్నది సర్వ సాదారణం. అంటే తెలంగాణ సిఎం.రేవంత్రెడ్డి జాతకం కూడా ప్రజలకు ఎంతో కలిసి వస్తుంది. మేలు చేస్తుందని పండితులు కూడా అంటున్నారు. గత ఏడాది బిఆర్ఎస్ నాయకులు పంటలు ఎండిపోతున్నట్లు కొంత హడావుడిచేసే ప్రయత్నం చేశారు. ఏకంగా కేసిఆరే రైతుల వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నాలు చేశారు. కాని రైతులు నమ్మలేదు. ప్రజలు కూడా నమ్మలేదు. అదంతా బిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని అందరూ తేల్చి చెప్పేశారు. కొంత మంది రైతులు అక్కడక్కడా నీటి సౌలత్కు మించి, వరి సాగు చేసుకున్నారు. వారికి వున్న వున్న బోర్ల మూలంగా నీరు సమృద్దిగా అందలేదు. అలాంటి కొంత మంది రైతుల వరి కొద్ది దశలో ఎండిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అది రైతు తప్పు. వరి పంట పొట్టకొచ్చిన సమయంలోనో, గింజ వేవే సమయంలోనో, గింజ మరో పది రోజులైతే గట్టిపడుతుందనే సమయంలోనో నీళ్లు అందకపోతే అది నష్టంగా భావించొచ్చు. కాని అసలు వరి ఎదగకుండా ఎండిపోయే పరిస్దితి వచ్చిందంటే అది రైతు పొరపాటుగానే పరిగణించాల్సి వస్తుంది. అలాంటి ఒకరిద్దరు రైతులను గుర్తించి బిఆర్ఎస్ రాజకీయం చేయాలనుకున్నది. కాని కుదరలేదు. సరిగ్గా ఎన్నికల ముందు కేసిఆర్ నల్లగొండ సభతో ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిందిదాద్దమనుకున్నాడు. బిఆర్ఎస్ సోషల్ మీడియా చెబుతున్నదే నిజమని జనంలోకి వచ్చారు. ఒకరిద్దరు రైతుల పొలాలు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. అక్కడే కేసిఆర్ మోసపోయాడు. లేని పరిస్దితులను సృష్టించి రాజకీయం చేయాలనుకొని కేసిఆర్ మొదటిసారి మోసపోయాడని కూడా చెప్పొచ్చు. సరిగ్గా అదే సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్కు ప్రజలు కనీసం ఆదరించలేదు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కనీసం కేసిఆర్ వెళ్లిన నియోజకవర్గంలో కూడా బిఆర్ఎస్ ప్రభావం చూపలేదు. బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొదటిసారి తెలంగాణలో అన్ని నియోజక వర్గాలలో మూడో స్దానానికి పడిపోయింది. పంటలు ఎండిపోయానని గగ్గోలు పెట్టిన సమయంలోనే రికార్డు స్దాయిలో తెలంగాణలో వరి పంట పండిరది. అంటే బిఆర్ఎస్ చేసిన ప్రచారం ఒట్టిదే అని తేలిపోయింది. ఓ పక్క చెరువులు నింపామని, మరో పక్క కాళేశ్వరం నీళ్లు నిరంతరం ఇచ్చామని చెప్పుకున్న బిఆర్ఎస్ హాయం కన్నా, ఎక్కువగా వరి సాగైంది. అంతకు మించి నలభై శాతం అధికంగా పంటలు పండాయి. కాంగ్రెస్ వస్తే కరువని,కరంటు వుండదని బిఆర్ఎస్ ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అంతెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇంత వరకు రోడ్డెక్కిన సందర్భం లేదు. బిఆర్ఎస్ నాయకులు చేసే హడావుడి తప్ప ఎక్కడా రైతులు ఆందోళన చేసింది లేదు. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం తెచ్చిందని అని కూడా అనుకుంటున్నారు. అందుకే రికార్డు స్దాయిలో పంటలు పండిస్తున్నారు. అంతే కాదు తెలంగాణలో 92 శాతం మంది రైతులు సన్నాలు పండిస్తున్నారు. నిజానికి సన్నాలకు నీరు కూడా ఎక్కువ కావాలి. ఎరువులు,పురుగుల మందుల ఖర్చు కూడా ఎక్కువౌతుంది. అయినా రైతులు సన్న వరి పండిస్తున్నారంటే పంట చేతికి వస్తుందని, లాభం వస్తున్న నమ్మకంతోనే వేస్తున్నారు. పండిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణం చేశాం…ఇక భవిష్యత్తులో మూడు సంవత్సరాల పాటు కరువు వచ్చినా సరే, పంటలకు ఢోకా వుండదని, నీటి కొరత అసలే రాదని కేసిఆర్ పదే పదే చెప్పేవారు. ఇది కాళేశ్వరం పూర్తికాముందు అనేక సార్లు కేసిఆర్ చెప్పిన మాట. కాళేశ్వం పూర్తి చేసి, ప్రారంభించిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే అన్నారు. రైతులు వరి వేయొద్దని ప్రకటించారు. అసలు తెలంగాణలో కరువు అంటూ కనించదని చెప్పిన కేసిఆర్ నీళ్లు సరిపోవని వరి వేయొద్దని రైతులను హెచ్చరించాడు. పైగా రైతులు సన్నాలు పండిరచాలని ఓ ప్రయోగం చేశాడు. తర్వాత పంటకే సన్నాలు వద్దని వారించాడు. ఇలా రైతులను పదే పదే మోసం చేసిన సందర్భం వుంది. కాని రేవంత్ సర్కారు సూచనతో తెలంగాణ వ్యాప్తంగా రైతులను సన్నాలు పండిరచేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ పంటతో వచ్చిన బియ్యాన్ని దేశంలోనే తొలిసారిగా రేషన్ దుకాణాల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంటే వాన దేవుని కరుణ రేవంత్ రెడ్డి మీద ఎంత వుందో చెప్పడానికి ఈ ఒక్క ముక్క చాలు.