విద్యార్థుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి

నర్సంపేట,నేటిధాత్రి :

భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,
పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు
అల్వాల నరేష్,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిద్దు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల
ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి వారికి నివాళులర్పించారు.అనంతరం వారు
మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతికి కారణాలు పై విచారణ జరపాలన్నారు.విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వివరించిన హాస్టల్ వార్డెన్, సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.విద్యార్థినిల కుటుంబాలకు ప్రభుత్వం ఆడుకొని పది లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజు, రమేష్, ప్రశాంత్, వినయ్, రాకేష్, ప్రమోద్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *