కుమార్తె పుట్టినరోజున జి.పి సిబ్బందికి రేమాండ్స్ దుస్తుల అందజేత
ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు
నర్సంపేట నేటిధాత్రి:
ఎన్నో సంవత్సరాల నుండి నిత్యం గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బందిలో ఒకరైన కడగండ్ల నర్సయ్య (చిన్ని)కి ఆర్టీసీ ఉద్యోగి, గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గొలనకొండ వేణు, చైతన్య ప్రథమ కుమార్తె గొలనకొండ సహస్ర పుట్టినరోజును పురస్కరించుకొని మే 29న గురువారం నర్సయ్య(చిన్ని)కి విలువైన రేమాండ్స్ దుస్తులను సహస్ర చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అందించి ఆదర్శంగా నిలిచారు.గత నాలుగు నెలల క్రితం జనవరి 30న వేణు, చైతన్య దంపతుల కుమారుడు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా గురిజాల గ్రామ పంచాయితీ సిబ్బందికీ జీవితాంతం పట్టు చీరలు, రేమాండ్స్ దుస్తులను తమ ముగ్గురు పిల్లల పుట్టిన రోజున అందించడానికి గ్రామంలో తొలి సారిగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 10న తమ కనిష్ట కుమార్తె ఆరాధ్య పుట్టినరోజున కూడా మరో మహిళా పంచాయితీ సిబ్బందికి పట్టుచీర అందజేస్తామని వేణు చైతన్య, దంపతులు తెలిపారు. తమ సేవలను గుర్తించినందుకు గాను గ్రామ పంచాయితీ సిబ్బంది వేణును శాలువాతో సత్కరించారు.