హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం……..
బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.