జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుద్దాల వాగు శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం రాత్రి భూమిని చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి బైరినేని మాంతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మాంతయ్య అత్తగారి ఊరైన కిష్టంపేటలో నివసిస్తూ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కు అమర్చిన రోటవేటర్ కింద పడి మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు.