ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది.

Chief Minister Revanth Reddy. Chief Minister Revanth Reddy.

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం/ నేతి ధాత్రి

 

 

 

 

 

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.

 

Chief Minister Revanth Reddy.
Chief Minister Revanth Reddy.

 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు  పోయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!