పేదల సొంతింటి కల నెరవేరుతుంది
ఇచ్చిన హామీలను నెరవేస్తున్న కాంగ్రెస్ పార్టీ.
మొగులపల్లి నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో BRS పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే.
గండ్ర వెంకట రమణారెడ్డి మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లపై అవకతవకలు జరిగినవని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తూ.
ఈరోజు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్ స్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ.
ఇళ్లలో అవకతకులు జరిగినట్లు మీరు చూపించడానికి సిద్ధంగా ఉంటే మండలంలోని ఏ గ్రామంలోనైనా చర్చకు మేము సిద్ధమే సమయం వేదిక మీరు ఎక్కడ కోరిన మేము అక్కడికి రావడానికి ఏ చర్చ కైనా దేనికైనా మా కాంగ్రెస్ పార్టీసిద్ధమే అని ఆయన అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ జిల్లా నాయకులు మండల రవీందర్ ఏలేటిశివారెడ్డి దండ వెంకటేశ్వర రెడ్డి.
యారా రవికుమారు గుండారపు తిరుపతి మాజీ సర్పంచులుకాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు