భద్రాచలం నేటి ధాత్రి
బుధవారం నాడు చర్ల మండల కేంద్రంలోఈర్ప ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంగం రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ భద్రాచలంలో న్యాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్ తో ఈనెల 28 29 30 తేదీలలో హైదరాబాద్ వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాన ఉద్దేశంతో జులై నెల నుండి కరపత్రాలు కార్యచరణ రూపకల్పన చేసి ప్రసారం నిర్వహించినప్పటికీ ధర్నా కార్యక్రమo అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు
సంగం ముఖ్య కార్యకర్తలు సంఘం యొక్క అభిమానులు శ్రేయోభిలాషులు మేధావులు విద్యార్థులు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నారు
త్వరలో ధర్నా జరిగే తేదీలను ప్రకటిస్తామని అన్నారు ఎవరు కూడా నీరుర్చాహానికి గురికాకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో శరం రవీందర్ యాలం నరసింహారావు శరం సుధాకర్ పాల్గొన్నారు