తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి

జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సీనియర్ నాయకులు కోరపల్లి గ్రామస్తుడు పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పది సంవత్సరాల కాలం పని చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో ఆ కాలంగా మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి జమ్మికుంట డిగ్రీ కళాశాలలో చదువుకొని ఆనాటి కాలంలోనే ఎన్ ఎస్ సి ఐ నాయకుడిగా రాజకీయ ప్రవేశం చేసి అంచలంచలుగా ఎదిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా ఉండడంతోపాటు తన రాజకీయ గురువు సత్యనారాయణరావు మద్దతుతో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా 2005 నుండి2014 వరకు మార్కెట్ చైర్మన్ పనిచేశారు. తదుపరి రాజకీయ పరిణామాల దృశ్య 2018లో ఈటల రాజేందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలత సభ్యునిగా పనిచేశారు. అనంతరం 2023 కాంగ్రెస్లో సొంతగూటికి చేరుకొని గాంధీభవన్లో కాంగ్రెస్ మీడియా కన్వీనర్ గా సొంతంగా కాంగ్రెస్ వాయిస్ అనే పత్రికను ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఉన్న తుమ్మేటి సమ్మిరెడ్డి అకాల మృతి పట్ల రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, బల్మూరు వెంకట్, హైదరాబాదు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని కోటి, యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *