
End of Nizam’s Tyranny Remembered
నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు
* బిజెపి మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్
మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రామ్ శెట్టి మనోజ్ బుధవారం రోజున మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమ గీతం పాడిన రోజని అన్నారు. మహాదేవ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం మండల బిజెపి అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు అని, రజాకర్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజని, దొరల గడీల్లో బానిసత్వానికి సమాధి కట్టిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు లింగంపల్లి వంశీధర్ రావు, బల్ల శ్రావణ్, మండల కోశాధికారి ఊదరి పూర్ణచందర్, కార్యదర్శి బందుల సంతోష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఓడేటి బాల్రెడ్డి, మండల నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.