
Dairy Farm.
పాల కొనుగోలు ఆపిన డైరీ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రాంతంలోని పాల రైతులు, పాల డైరీ కేంద్రం ఆరు సంవత్సరాలుగా పాలు కొనుగోలు చేయకుండా నిలిపివేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారని డైరీ ఫార్మ్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు తెలిపారు. గోవిందపూర్ పరిధిలోని ఈ కేంద్రం నుంచి ఇటీవల పాలు కొనడం ఆగిపోయింది. ఈ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ, అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల రైతులు బుధవారం సాయంత్రం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు.