
President Repaka Rajender
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకె దక్కుతుంది
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి- జ్యోతి నిన్న స్కూళ్లలో విస్తృత పర్యటనలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉంది
గడిచిన 10 సంవత్సరాలు బి ఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అప్పుడు గుర్తుకు రాలేదా పాఠశాలల మీద వీరి ప్రేమ.
గడిచిన 10 సంవత్సరాలలో
మండల కేంద్రంలో ఒక ఎంఈఓ ను కూడా నియమించలేదు
పిల్లలకు ఎటువంటి కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు ఇవ్వలేదు.
పాఠ్య పుస్తకలు ఏక రూప దుస్తువులను ఇవ్వలేదు
వారు తినే భోజనాన్ని ఒక్కరోజు ఎలా ఉంది అని అడిగిన పాపాన పోయిన నాధుడే లేడు.
ఈరోజు మా నాయకుడు భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేక. ఏ అంశాల మీద మాట్లాడాలో తెలవక పాఠశాలల చుట్టూ తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారు.
మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిర్మించిన పాఠశాలను ఏ రోజైన తనిఖీ చేశారా. మీ నాయకులైన తనిఖీ చేశారా. కనీసం పాఠశాలలో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను ఏ రోజైన భర్తీ చేశారా.
హాస్టల్లో స్కావేందర్స్ పోస్ట్ లను నియమించాలని జ్ఞానం కూడా లేకుండా మీరు మీ నాయకులు మాట్లాడుతున్నారా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను ప్రతిష్ట చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని విద్య వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలకు ఎదిగేలా చేయాలని దృఢ సంకల్పంతో, మా నాయకుడు కృషి చేస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్. కో ఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్. మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ. వైస్ ఎంపీపీ విడుదలైన అశోక్. మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ. మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున గౌడ్.వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్. సీనియర్ నాయకులు బాల్య కుమార్. పూదరి రవి. ఎస్కే జానీ. దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.