
Odedu Vagu Bridge Construction Remains Incomplete
కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం
భూపాలపల్లి నేటిధాత్రి
గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు