కలగానే బ్రిడ్జి నిర్మాణం… ఎన్నో ఏండ్లుగా
నేరేడుపల్లి గ్రామస్తుల ప్రజలు ఎదురుచూపు
దశాబ్దాలుగా ప్రజల ఆశ నెరవేరేనా!
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామ స్తులు ఎదురుచూస్తున్నారు మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికా రులు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతుందని ప్రజలు వాపోతున్నారు.
ఈసారైనా నెరవేరేనా!
గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రాజకీయ నాయకులు గ్రామ నాయకులు వేడుకున్న పట్టించుకోకపోవ డం కాని తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజ లు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ముందున్న లక్ష్యం కాబట్టి ఈసారి తమ కల నెరవేరుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల తరబడి ఎదుర్కొం టున్న తమ సమస్యకు పరి ష్కారం చూపాలని నేరేడుపల్లి చలివాగు బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు
చుట్టూ తిరిగి వెళుతున్నాం
నేరేడుపల్లి,పత్తిపాక రహ దారిపైబ్రిడ్జికి మోక్షం కలిగే నా!.
ఇబ్బంది పడుతున్న రైతన్నలు.
శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయ కులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం ఆ తర్వాత విస్మరిం చడం పరిపాటిగా మారింది. పత్తిపాక,నేరేడుపల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నా రు మండల గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఇబ్బందులు గురవు తున్నారు గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగు దాక వేసి కరెంటు అన్ని ఏర్పా టు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడైనా పూర్తి చేయాలి
ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూపులు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని, ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.