పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్
లక్నేపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
నర్సంపేట,నేటిధాత్రి:
నాటి నుండి నేటి వరకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన (రేషన్ బియ్యం) సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం సన్న బియ్యం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, లక్నేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిలొని అశోక్, నర్సంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్,నర్సంపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జి రాజు, లక్నేపల్లి యూత్ అధ్యక్షుడు గొడిశాల సురేష్, మండలం యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సూదుల మహేందర్, చెన్నారావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు సిద్దేన రమేష్,తప్పేట రమేష్గ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, బైరి మురళి,మ్తెదం రాకేష్,కమతం వీరభద్రయ్య ,ఒర్రంకి వేణు ,కత్తి వేణు, కోల విజేందర్, కళ్ళం సంపత్ , గాదం రాజ్ కుమార్, నాన్న బోయిన రాజు, రాజులపాటి సూరయ్య ,కత్తి చిన్న కట్టయ్య, రాజులపాటిరాజు, మునిగాల రాజేందర్ ,సూత్రం కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.