కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ ఆదేశం మేరకు కొప్పుల, కాట్ర పల్లి గ్రామాలలో నూతనంగా కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకె ళ్లాల చూడాలన్నారు అనం తరం నూతన గ్రామ కమిటీ లను ఎన్నుకున్నారు కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వాంకు డోత్ జగన్ ఉపాధ్య క్షుడిగా ఆరే కమలాకర్ ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీకాంత్ కోశాధికారిగా కొప్పుల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏరుకొండ శంకర్ ఉపాధ్యక్షుడిగామామిడి రవి ,ప్రధాన కార్యదర్శిగా చాడ రామ్ రెడ్డి, పిట్టల నరేష్ ఎన్నుకున్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మండల నాయకులు బాసని చంద్ర ప్రకాష్ ,చల్లా చక్రపాణి, అబు ప్రకాష్ రెడ్డి ,మారేపల్లి రవీందర్ దుబాసి కృష్ణమూర్తి, పోతు కృష్ణమూర్తి, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.