పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.
మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి:
గతంలో పేదవారికి రోటి, మకాన్ అని మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ నినాదించి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందించి. ఇండ్లను నిర్మించి ఇచ్చిందని ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లను మంజూరు చేస్తుందని. పేదవారికి ఇండ్లు నిర్మించే ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షాకీర్ సిద్ధికి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ కాలనీలో పేద ప్రజలకు మంజూరైన 21 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి షాకీర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు దివ్య, ఏ ఈ లు తిరుపతి, శరత్, ఇంజనీర్ జాకీర్, సోయబ్, కాంగ్రెస్ నాయకులు మురళి, ఇరుగదిండ్ల శ్రీనివాస్, లక్ష్మమ్మ, లడ్డు, రాములు,