రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
◆: జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి…!
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలు రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మహిళలకు ఉ చిత బస్సు సౌకర్యం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా బీసీ కమిషనర్ ఏర్పాటు కులగణన రైతు కమీషన్ ఏర్పాటు విద్య కమీషన్ ఏర్పాటు విద్యా కమిషన్ ఏర్పాటు వైశ్య కార్పొరేషన్ రైతు కూలీలకు రైతు భరోసా సన్న వడ్లకు 500 బోనస్ ఇలాంటి అనేక పథకాలు చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు.