కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశాలు.
వనపర్తి నేటిధాత్రి :
సోమవారం కలెక్టర్ కార్యలయముల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వీకరించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇచ్చే బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజావాణి, మంత్రి ద్వారా వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. పి డి ఆర్ డి ఏ ఉమాదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.